బడాపహాడ్ వెళ్తుండగా డీసీఎం బోల్తా.. 35 మందికి గాయాలు

by Disha Web Desk 4 |
బడాపహాడ్ వెళ్తుండగా డీసీఎం బోల్తా.. 35 మందికి గాయాలు
X

దిశ ప్రతినిధి , నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో డీసీఎం బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా చందూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. బడా పహడ్(దర్గా) వెళ్తున్న సమయంలో డీసీఎం వాహనం బోల్తా పడింది. డీసీఎంలో 60 మంది ఉన్నట్లు తెలిసింది. అందులో 35 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వర్ని ఎస్సై సమయ స్పూర్తితో హుటాహుటిన క్షత గాత్రులను నాలుగు అంబులెన్స్‌లో నిజామాబాద్ తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

Read More: పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. దంపతులు స్పాట్‌డెడ్

Next Story

Most Viewed